విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా... విశ్వసనీయత ముఖ్యం: జగన్
- భయపడో, రాజీపడో వెళ్లిపోతే ఎలాగని జగన్ ప్రశ్న
- ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని వ్యాఖ్య
- అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదన్న జగన్
- లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్న
- ఎవరినో ఒకరిని ఇరికించడం వాళ్లకు అలవాటేనని మండిపాటు
అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్లు ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు.
లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? అని జగన్ ప్రశ్నించారు. మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రి? ఆయనకు లిక్కర్ కు ఏం సంబంధమని అడిగారు. ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని విమర్శించారు.