Chiranjeevi: చిరంజీవిని కలిసిన నాగార్జున

Nagarjuna invites Chiranjeevi to ANR National Award 2024 ceremony

  • 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం
  • ఈ ఏడాది తమకు ఎంతో ప్రత్యేకమని ట్వీట్ చేసిన నాగార్జున
  • అమితాబ్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. ఈ నెల 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది తమకు చాలా ప్రత్యేకమని, తన తండ్రి శతజయంతి వేడుకలకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి‌ని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. వారి రాక తమకు మరింత గౌరవంగా మారనుందని పేర్కొన్నారు. ఈ వేడుకను మరుపురానిదిగా చేద్దామని రాసుకొచ్చారు.

అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్నారు. చిరంజీవిని వేడుకకు ఆహ్వానిస్తున్న ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

  • Loading...

More Telugu News