Dhanush: హీరో ధ‌నుశ్, ఐశ్వ‌ర్య‌లపై కొత్త పుకారు

Big Twist in Hero Dhanush Divorce

  • 2022లో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ధ‌నుశ్, ఐశ్వ‌ర్య‌ 
  • ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసి ఉండేందుకు ధ‌నుశ్ దంప‌తుల‌ నిర్ణ‌య‌మంటూ పుకార్లు  
  • ఇది నిజ‌మైతే బాగుండును అని కోరుకుంటున్న అభిమానులు

ప్రేమ పెళ్లి చేసుకున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుశ్ రెండేళ్ల క్రితం విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ షాకిచ్చారు. 2022 నుంచి ఈ జంట విడివిడిగానే ఉంటోంది. ఇక ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, పిల్ల‌ల బాధ్య‌త‌ను మాత్రం ఇద్ద‌రూ చూసుకుంటున్నారు. 

ఈ క్ర‌మంలో తాజాగా వీరి విడాకుల విష‌యంలో ఊహించ‌ని ట్విస్ట్ చోటుచేసుకుంది. హీరో ధ‌నుశ్, ఐశ్వ‌ర్య క‌లిసి ఒక కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కుటుంబ కార‌ణాలు, ర‌జ‌నీకాంత్ అనారోగ్యం దృష్ట్యా ఐశ్వ‌ర్య కాస్త వెన‌క్కి త‌గ్గి ధ‌నుశ్‌తో క‌లిసి ఉండ‌టానికి అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. 

అలాగే ధనుశ్ కూడా ఐశ్వ‌ర్య‌తో క‌లిసి ఉండ‌టానికి ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై దంప‌తుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. ఇందులో నిజ‌మెంతో తెలియ‌న‌ప్ప‌టికీ.. ఈ వార్త మాత్రం ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇది నిజ‌మైతే బాగుండును అని అభిమానులు కోరుకుంటున్నారు.  

  • Loading...

More Telugu News