Bridge Collapse: తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి... ముచ్చటగా మూడోసారి కూలింది... వీడియో ఇదిగో!

Under construction for 9 years bridge in Bihar collapses for 3rd time

  • బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలో ఘటన
  • సుల్తాన్ గంజ్ - అగువాని గంగా నదిపై నిర్మాణం
  • ఇప్పటికే రూ.1717 కోట్లు వెచ్చించిన సర్కారు

బీహార్ లో ఓ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై రూ.1717 కోట్లు వెచ్చించింది. ఇప్పటికే రెండు సార్లు కూలిన ఈ బ్రిడ్జి శనివారం మరోమారు కూలిపోయింది. నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాక ఎన్నిరోజులు నిలుస్తుందని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్ గంజ్ - అగువాని గంగా నది రూట్ లో ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది

నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి తొమ్మిదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కట్టిన వాటిలో రెండు పిల్లర్లు కూడా కూలిపోవడంపై నిపుణులు మండిపడుతున్నారు. 

కాగా, ఖగరియా జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదనే విమర్శలపై పాట్నా హైకోర్టు స్పందించి, నిర్మాణ పనులపై స్టే ఇచ్చిందన్నారు. ఇప్పటికే పూర్తయిన భాగాన్ని కూడా కూల్చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించిందని చెప్పారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా వంతెన కూల్చివేత పనులు చేపట్టారని వివరించారు.

ఖగరియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి కాంట్రాక్టును ఎస్పీ సింగ్లా కంపెనీ దక్కించుకుంది. 2014 లో నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణం పూర్తిచేయడానికి ప్రభుత్వం విధించిన గడువును ఎనిమిదిసార్లు పొడిగించింది. 2022 లో వచ్చిన తుపాను కారణంగా నిర్మాణం దెబ్బతింది. ఆ తర్వాత కూడా బ్రిడ్జి కూలిపోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

  • Loading...

More Telugu News