Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు ఘన విజయం
![Raghu Rama Krishna Raju Won in Undi](https://imgb.ap7am.com/thumbnail/cr-20240604tn665ed6a5cb1ac.jpg)
- ఉండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీడీపీ అభ్యర్థి ఆర్ఆర్ఆర్
- వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ నరసింహరాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీ
- వైసీపీ అభ్యర్థికి 60,125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్కు 1,16,902 ఓట్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ నరసింహరాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజయదుందుభి మోగించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60,125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్కు 1,16,902 ఓట్లు వచ్చాయి.