భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని నిలబెట్టాలి: చంద్రబాబు
- శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు సిగ్గుచేటన్న చంద్రబాబు
- దక్షిణాది వారికి ప్రత్యేక సంస్కృతి, గుర్తింపు ఉన్నాయని వెల్లడి
- వివిధ రాష్ట్రాలకు చెందినవారిమైనా మనమంతా భారతీయులమేనని పునరుద్ఘాటన
మనం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు చెందినవారమైనప్పటికీ ముందు మనమంతా భారతీయులమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వ్యక్తుల గుర్తింపును వారి వేషధారణ, రూపం, చర్మపు రంగు వంటి వాటితో కుదించి పోల్చడం నిజంగా సిగ్గు చేటని విమర్శించారు. ఇటువంటి తిరోగమన, జాత్యహంకార వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, శ్యామ్ పిట్రోడా చేసిన విభజన వాద, జాత్యహంకార వ్యాఖ్యలకు నాగరిక సమాజంలో తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు.