ఎమ్మెల్సీ కవితకు హైబీపీ.. కోర్టులో మరో పిటిషన్
- నేటితో ముగిసిన ఈడీ కస్టడీ
- మరో మూడు రోజుల కస్టడీ కోరనున్న ఈడీ
- కొనసాగింపునకు కవిత లాయర్ల అభ్యంతరం
కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే, కస్టడీ కొనసాగింపును కవిత తరఫు లాయర్లు అడ్డుకోనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్ ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారని సమాచారం.