రామ్ చరణ్, ఉపాసనలకు అయోధ్య రామ మందిరం ఆహ్వానం
- రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్
- చరణ్ దంపతులను ఆహ్వానించిన ఆరెస్సెస్ నేత
- ఈ నెల 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం
ఈ కార్యక్రమానికి మొత్తం 8 వేల మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రామాలయం కాంప్లెక్స్ ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయం నిర్మితమయింది.