ఆస్ట్రేలియాతో 20 సిరీస్కు టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్!
- రేసులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్
- పాండ్యా గైర్హాజరు నేపథ్యంలో కెప్టెన్గా కొత్తవారికి ఛాన్స్
- విశ్రాంతి కోరకుంటే సూర్యకే అవకాశం ఉందంటున్న బీసీసీఐ వర్గాలు
కాగా వన్డే వరల్డ్ కప్లో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాతో ఆడబోయే జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. నవంబర్ 15న ముంబైలో ఇండియా సెమీస్ మ్యాచ్ ఆడనుంది. హార్ధిక్ పాండ్యా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 10 నుంచి మొదలుకానున్న దక్షిణాఫ్రికా టీ20 పర్యటన నాటికల్లా పాండ్యా అందుబాటులో ఉండే అవకాశం ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాఫ్రికా సీరిస్కు పాండ్యా అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం ఉందని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సౌతాఫ్రికా సిరీస్లో ఆడేందుకు అవకాశాలున్నాయని, అయితే దీనిపై తుది నిర్ణయం నేషనల్ క్రికెట్ అకాడమీలోని వైద్య బృందం పరిధిలో ఉంటుందని చెప్పారు.