ఆసియా గేమ్స్ తొలి పోరులోనే శతకంతో చరిత్రకెక్కిన యశస్వి జైస్వాల్
- ఆసియా క్రీడల్లో నేపాల్ తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
- ప్రత్యర్థికి 203 పరుగుల లక్ష్యం నిర్దేశించిన జట్టు
- మల్టీ స్పోర్ట్ ఈవెంట్ లో శతకం చేసిన భారత పిన్న వయస్కుడిగా యశస్వి రికార్డు
అతడితోపాటు రింకూ సింగ్ (15 బంతుల్లో 37 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (25), శివం దూబె (25 నాటౌట్) కూడా రాణించారు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (2), జితేశ్ శర్మ (5) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర రెండు, సందీప్, సోంపాల్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ జట్టు 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులతో ఎదురీదుతోంది. కాగా, ఈ మ్యాచ్ తో భారత ఆటగాళ్లు సాయి కిశోర్, జితేశ్ శర్మ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశారు.