త్వరలోనే ఇంటర్ విద్యార్థులకు కూడా 'జగనన్న గోరుముద్ద': బొత్స సత్యనారాయణ
- జగనన్న గోరుముద్ద పథకం దేశానికే ఆదర్శమన్న బొత్స
- జగన్ నేతృత్వంలో విద్యా శాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామని వ్యాఖ్య
- అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నామన్న మంత్రి
చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి కేవలం రూ. 2,729 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని... వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ. 6,268 కోట్లు ఖర్చు చేశామని బొత్స తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మరో రూ. 1,500 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. ఒక్కో మండలానికి కనీసం రెండు ఉన్నత పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించామని చెప్పారు.