పరమేశ్వరుడికి సమర్పిద్దామని గొంతు కోసుకున్న యువకుడు
- యూపీలోని లలిత్ పూర్ లో జరిగిన దారుణం
- ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో బాధితుడు
- శివుడిపై ఉన్న భక్తితోనే అలా చేసినట్టు పోలీసుల వెల్లడి
రఘునాథపురానికి చెందిన దీపక్ కుశ్వహగా బాధితుడిని గుర్తించారు. కొంతవరకు గొంతు కోసుకున్న తర్వాత ఆ బాధ తాళలేక కేకలు పెట్టడంతో సమీపంలోని వారు విని పరుగెత్తుకు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఝాన్సీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీపక్ కు పరమశివుడు అంటే పరమ భక్తి అని పోలీసులు వెల్లడించారు. అతడి నోట్ బుక్ లో శివుడి గురించి ఎన్నో రాతలు ఉన్నట్టు తెలుసుకున్నారు. తన తలను శివుడికి సమర్పిస్తానని కూడా అందులో రాసి ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.