‘ఆదిపురుష్’పై ట్రోలింగ్స్కు ఎండ్కార్డ్ వేయాలని నిర్ణయం.. నేడు త్రీడీలో విడుదల కానున్న టీజర్
- ప్రభాస్ కథానాయకుడిగా మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’
- వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- నేడు హైదరాబాద్ వేదికగా 3డీలో టీజర్
- హాజరు కానున్న ప్రభాస్, దర్శకుడు ఓంరౌత్
ఈ నేపథ్యంలో చిత్రబృందం నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. నేడు హైదరాబాద్ వేదికగా 3డీలోనూ ‘ఆదిపురుష్’ టీజర్ను విడుదల చేయబోతోంది. ఈ వేడుకకు దర్శకుడు ఓంరౌత్, నటుడు ప్రభాస్ హాజరవుతారు. ఈ వేడుకలో చిత్రంపై వస్తున్న విమర్శలపై వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాగా, రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు.