CM Jagan: పుత్ర వియోగంతో బాధపడుతున్న సత్య నాదెళ్ల... సీఎం జగన్ సంతాపం

CM Jagan condolences to Jain Nadella demise

  • సత్య నాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూత
  • తీవ్ర విషాదంలో సత్య నాదెళ్ల కుటుంబం
  • ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్
  • ధైర్యంగా ఉండాలంటూ ట్వీట్

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ (26) కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. పుత్ర వియోగంతో బాధపడుతున్న సత్య నాదెళ్లకు సానుభూతి తెలిపారు. "సత్య నాదెళ్లకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. జైన్ నాదెళ్ల మృతి కలిగించిన విషాదం నుంచి వారి కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారికోసం ప్రార్థిస్తున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

పుట్టుకతోనే సెరెబ్రల్ పాల్సీ బారినపడిన జైన్ నాదెళ్ల... సత్య నాదెళ్ల, అను దంపతులకు తొలి సంతానం. జైన్ తన జీవితకాలం వీల్ చెయిర్ కే పరిమితమయ్యాడు.

CM Jagan
Jain Nadella
Sathya Nadella
Microsoft
  • Loading...

More Telugu News