ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమన్న చంద్రబాబు
- తాము ఐదేళ్లూ అధికారంలో ఉంటామన్న మిథున్ రెడ్డి
- పార్టీని కాపాడుకునేందుకేనంటూ చంద్రబాబుపై విమర్శలు
- తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం తెలిసిందే. రాష్ట్రంలో మళ్లీ 2024లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపాలంటూ ప్రధాని మోదీ అభిలషిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.