మంత్రులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకూడదు: సీఎస్కు నిమ్మగడ్డ రమేశ్ లేఖ
- మంత్రుల పర్యటనల్లో అధికారులు ఉండకూడదు
- వారి ప్రతి పర్యటన ఎన్నికల ప్రచారంగానే భావించాలి
- విలేకరుల సమావేశాల కోసం ప్రభుత్వ భవనాలు వాడకూడదు
నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైందని, మంత్రులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకూడదని ఆ లేఖలో తెలిపారు. మంత్రుల పర్యటనల్లో అధికారులు ఉండేందుకు వీల్లేదని చెప్పారు. నేతలు పార్టీ కార్యాలయాలకు వెళ్లే సమయంలో, ప్రచారాల్లో పాల్గొంటోన్న సమయంలోనూ ప్రభుత్వ వాహనాలను వాడరాదని చెప్పారు.
అలాగే, మంత్రులు, ప్రజాప్రతినిధులు చేపట్టే ప్రతి పర్యటన ఎన్నికల ప్రచారంగానే భావించాల్సి వస్తుందని అన్నారు. వారి పర్యటనలను అధికార పర్యటనలతో ముడిపెట్టవద్దని చెప్పారు. అలాగే, విలేకరుల సమావేశాల కోసం ప్రభుత్వ భవనాలతో పాటు ఇతర ప్రభుత్వ సదుపాయాలను వినియోగించకూడదని చెప్పారు.