అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
- కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ
- బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్
- కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
- అఖిలప్రియ సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని వెల్లడి
అఖిలప్రియ విడుదలైతే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆమెకు రాజకీయ, ఆర్థిక పలుకుబడి మెండుగా ఉందని వివరించారు. ఆమె ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బెయిల్ ను ఉపయోగించుకునే అవకాశం ఉందని వివరించారు. హఫీజ్ పేటలో పాతిక ఎకరాల భూ వివాదంలో ప్రవీణ్ రావు అనే వ్యక్తితో పాటు ఆయన ఇద్దరు సోదరులు కిడ్నాప్ కు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు అఖిలప్రియను ఏ1గా, ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా, అఖిలప్రియ భర్త భార్గవరామ్ ను ఏ3గా పేర్కొన్న సంగతి తెలిసిందే.