Prabhas: ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాకి దిగ్గజ దర్శకుని గైడెన్స్!

  • ప్రభాస్, దీపికలతో వైజయంతీ సినిమా 
  • సోషియో ఫాంటసీ కథతో నిర్మాణం    
  • సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ గైడెన్స్    
  • సింగీతంను ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ 
Singeetam guidens to Prabhas pan India movie

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'విచిత్ర సోదరులు', 'పుష్పక విమానం', 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి క్లాసిక్స్ అనదగ్గ పలు చిత్రాలను రూపొందించి టాలీవుడ్ చరిత్రలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారాయన. అటువంటి సింగీతం ఇప్పుడు ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ గైడెన్స్ చేయనున్నారు.

'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సోషియో ఫాంటసీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. పాన్ ఇండియా చిత్రంగా వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పడుకొణే కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడీ చిత్రానికి సింగీతం క్రియేటివ్ హెడ్ తరహాలో గైడెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.  

ఈ రోజు దర్శకుడు సింగీతం జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని తెలియజేసింది. 'మా చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరుతోంది. మా ఎపిక్ లోకి సింగీతం గారిని ఆహ్వానిస్తున్నందుకు ఎంతో అనుభూతి చెందుతున్నాం. ఆయన సృజనాత్మక శక్తులు మాకు కచ్చితంగా మార్గనిర్దేశం చేస్తాయి' అంటూ వైజయంతీ మూవీస్ పోస్ట్ పెట్టింది.

More Telugu News