Keerti Suresh: ప్రభాస్ 'ఆదిపురుష్'లో కథానాయికగా కీర్తిసురేశ్?

  • ప్రభాస్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం 'ఆదిపురుష్'
  • 'తానాజీ' ఫేం ఓం రౌత్ దర్శకత్వం 
  • రామాయణాన్ని నేటి పరిస్థితులకు అన్వయింపు 
  • సీతాదేవి పాత్ర విషయంలో కుతూహలం 
Keerti Suresh is considered for Aadipurush

ప్రభాస్ నటిస్తున్న తొలి డైరెక్ట్ హిందీ సినిమా 'ఆదిపురుష్' ప్రకటన వచ్చీరాగానే దానికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ-సీరీస్ 350 కోట్ల బడ్జెట్టుతో ఐదు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు నిన్ననే వెల్లడయ్యాయి. 'తానాజీ' వంటి భారీ చిత్రాన్ని రూపొందించిన ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం పురాణ కథ ఆధారంగా రూపొందుతుందని అంటున్నారు.

విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో ప్రభాస్ పోషిస్తాడని తెలుస్తోంది. రామాయణాన్ని నేటి సాంఘిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ చిత్రం రూపొందుతుందని అంటున్నారు. అంటే సోషియో ఫాంటసీగా కూడా వుండే అవకాశాలు వున్నాయని చెప్పచ్చు. ఇక ఇందులో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, అతని సరసన సీతాదేవి వంటి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అందరిలోనూ కుతూహలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రకు కీర్తి సురేశ్ ని చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలోనే తెలుస్తుంది.

More Telugu News