అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుక ఇస్తానన్న మొఘల్ వారసుడు!
- కిలో బంగారపు ఇటుకను ప్రధాని మోదీకి ఇస్తా
- హిందువులకు హృదయపూర్వక అభినందనలు
- ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ
కాగా, తాను మొఘలుల వారసుడినని చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరంలో కూడా వార్తల్లో నిలిచారు. తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆగస్టు 5వతేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు అయోధ్యలో రామాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానిస్తున్నప్పటికీ, వైభవంగా జరిపించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.