Prabhas: ప్రభాస్ హీరోగా కొరటాల మూవీ .. నిర్మాణ సంస్థగా మైత్రీ

Koratala Siva Movie

  • చిరూ సినిమాతో బిజీగా కొరటాల 
  • తదుపరి సినిమా చరణ్ తో 
  • 'మిర్చి' కాంబినేషన్ మళ్లీ సిద్ధం

ప్రస్తుతం చిరంజీవి సినిమాతో కొరటాల శివ బిజీగా వున్నాడు. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చరణ్ కథానాయకుడిగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఆల్రెడీ చరణ్ కి ఆయన కథ వినిపించడం .. చరణ్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కొరటాల టీమ్ కసరత్తు నడుస్తూనే ఉందని చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టు తరువాత ప్రభాస్ తో కొరటాల సినిమా వుండనుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో కొరటాల - ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి' భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే కొరటాల దర్శకుడిగా పరిచయమయ్యాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ కావడం, ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. నాగ్ అశ్విన్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లేది కొరటాలతోనే.

  • Loading...

More Telugu News