శర్వానంద్ తో 'సాహో' దర్శకుడు!
- 'రన్ రాజా రన్'తో హిట్
- విమర్శలు తెచ్చిపెట్టిన 'సాహో'
- మరో కథపై కసరత్తులు పూర్తిచేసిన సుజీత్
అయితే ప్రభాస్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. కథ లేకుండా ఖర్చు పెట్టించాడనే విమర్శలు వినిపించాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న సుజీత్, శర్వానంద్ కోసం ఓ కథను సిద్ధం చేశాడట. రేపో మాపో ఆయన ఆ కథను శర్వానంద్ కి వినిపించనున్నాడని అంటున్నారు. శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సుజీత్ తదుపరి సినిమా ఆయనతోనే ఉంటుంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.