nagachaitanya: చైతూ జోడీగా నిత్యామీనన్

- 'మజిలి' సినిమాతో బిజీగా చైతూ
- తరువాత సినిమా మేర్లపాక గాంధీతో
- త్వరలోనే రానున్న అధికారిక ప్రకటన
ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా 'మజిలి' సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన మేర్లపాక గాంధీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ .. 'కృష్ణార్జున యుద్ధం'తో నిరాశ పరిచాడు.
