బీటెక్ రవి దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆసుపత్రికి తరలింపు
- బలవంతంగా రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
- అత్యవసర చికిత్స అందించకపోతే ప్రమాదమంటున్న వైద్యులు
- ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తానంటున్న బీటెక్ రవి
రవి షుగర్ వ్యాధిగ్రస్తుడని, చికిత్స అందించడం ఆలస్యం చేస్తే ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటుందని వైద్యులు హెచ్చరించారు. మరోపక్క దీక్షా శిబిరం వద్దకు కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తన దీక్షను ఆసుపత్రిలోనే కొనసాగిస్తానని రవి చెప్పడం గమనార్హం. కాగా, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. రవి దీక్షను భగ్నం చేయడంతో.. సీఎం రమేష్ తన దీక్షను కొనసాగిస్తున్నారు.