ట్రైన్ టాయిలెట్లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్ఎస్ఎస్ఏఐ!
- ముంబై-ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్లో ఘటన
- సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియో
- ఐఆర్సీటీసీకి నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
- వివరణ ఇవ్వాలంటూ ఆహార భద్రతా సంస్థ ఆదేశం
ఈ ఉదంతంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తీవ్రంగా స్పందించింది. ఆహార నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగానూ ఐఆర్సీటీసీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రయాణికుల ఆరోగ్యం, పరిశుభ్రతతో చెలగాటమాడే ఇలాంటి పనులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను డిమాండ్ చేస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు.