భువనేశ్వర్ మ్యాజిక్.. ముంబై ఇండియన్స్ తడబాటు
- ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ముంబై ఇండియన్స్ మ్యాచ్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసిన ముంబై
- 4 వికెట్లతో చెలరేగిన బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్
- ముంబై ఇన్నింగ్స్లో తిలక్ వర్మ అర్ధ శతకం
- బెంగళూరు విజయ లక్ష్యం 167 పరుగులు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ తన పదునైన బౌలింగ్తో ముంబై టాపార్డర్ను కుప్పకూల్చాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (22) దూకుడుగా ఆడినా, భువీ బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో ముంబై 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్ (47), తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధాటిగా ఆడుతున్న ధీర్ను రసిఖ్ సలామ్ దార్ ఔట్ చేయగా, అర్ధ శతకం పూర్తి చేసుకున్న తిలక్ వర్మను కూడా భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై భారీ స్కోరు ఆశలకు గండిపడింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్కు తోడుగా హేజిల్వుడ్, రసిఖ్ సలామ్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.