ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి: ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ ముగిసిపోతుందన్న ట్రంప్
- ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని వెల్లడి
- లేదంటే గతంలో కంటే భీకరస్థాయిలో బాంబు దాడులు ఉంటాయన్న ట్రంప్
ఇరాన్ నుంచి సహకారం లేకుంటే మునుపటి కంటే భీకరస్థాయిలో, మరింత తీవ్రతతో బాంబు దాడులు ఉంటాయని హెచ్చరించారు. యుద్ధం ముగింపు దిశగా ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
యుద్ధాన్ని ముగించేందుకు, మరింత వివరణాత్మక అణు చర్చల కోసం ప్రేమ్ వర్క్ను ఏర్పాటు చేసేందుకు రెండు దేశాలు ఓ ఒప్పందానికి చేరువవుతున్నాయంటూ అమెరికా మీడియా సంస్థ ఒకటి తెలిపింది. అణు కార్యక్రమాల తాత్కాలిక నిషేధానికి ఇరాన్ ముందుకు రావడం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షలు ఎత్తివేయడం, ఇరాన్కు చెందిన నిధుల విడుదలకు అమెరికా అంగీకరించడం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.