హర్మూజ్ జలసంధిలో ఊరట... 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి!
- జలసంధి వద్ద ప్రారంభమైన చమురు నౌకల రాకపోకలు
- తమపై గౌరవసూచకంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందన్న ట్రంప్
- అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గే అవకాశం
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న విశ్లేషణలు
ఈ పరిణామంపై ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్ ఒక గొప్ప దేశం. వారు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగానే సోమవారం నుంచి 20 భారీ చమురు నౌకలను హర్మూజ్ జలసంధి దాటేందుకు అంగీకరించారు" అని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్కు భారీ ఊరట లభించినట్లయింది. యుద్ధ భయాలతో ఆకాశాన్నంటిన ముడిచమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇటీవల ఇరాన్పై అమెరికా దాడులు, ఖర్గ్ ఐలాండ్ను స్వాధీనం దిశగా అమెరికా ప్రయత్నాలు వంటి పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, దౌత్యపరమైన చర్చలు లేదా వ్యూహాత్మక ఒత్తిడి కారణంగా ఇరాన్ తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఇది ఒక సానుకూల సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.