ఇరాన్తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన
- 20వ రోజుకు చేరిన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం
- 200 బిలియన్ డాలర్లు ఇవ్వాలని పార్లమెంటుకు పెంటగాన్ ప్రతిపాదన
- ఇజ్రాయెల్ కోసం దేశ ప్రజలపై అమెరికా భారం మోపుతోందన్న ఇరాన్
దీనిపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ అజెండాను అమలు చేయడానికి అమెరికా సొంత పౌరులపై భారం మోపుతోందని ఆరోపించింది. ఈ యుద్ధం మొదలై మూడు వారాలే అయిందని పేర్కొంది. ఇజ్రాయెల్ అజెండా కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని విమర్శించింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యుద్ధం భారం సామాన్య అమెరికన్లపై పడుతోందని పేర్కొంది.