శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం
- సోమవారం స్వామివారిని దర్శించుకున్న 70,606 మంది భక్తులు
- హుండీ ద్వారా రూ. 4.39 కోట్ల ఆదాయం
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లు
నిన్న సోమవారం (మార్చి 16) ఒక్కరోజే 70,606 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదేవిధంగా, 28,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లుగా నమోదైంది.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
కాగా, భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.