‘కిడ్నాప్’ కు ఆధారాల్లేవు.. చోక్సీకి షాక్ ఇచ్చిన యూకే కోర్టు
- రూ.7 కోట్లకు సెక్యూరిటీ బాండ్ ఇవ్వాలని ఆదేశాలు
- ఆంటిగ్వాలో తనను కిడ్నాప్ చేశారంటూ చోక్సీ పిటిషన్
- ప్రత్యక్ష సాక్షులు లేరని వ్యాఖ్యానించిన కోర్టు
కేసు ఏంటంటే..
విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ కొంతకాలం ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో తనను భారత్ కు తరలించేందుకు కొంతమంది కుట్ర పన్నారని చోక్సీ ఆరోపించారు. హంగేరీకి చెందిన బార్బారా జబారికతో కలిసి భారత ఏజెంట్లు తనను కిడ్నాప్ చేశారని యూకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జబారిక తనతో స్నేహం నటించి ఆంటిగ్వా నుంచి బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లిందని, తప్పించుకుని బయటపడిన తనను బెల్జియం పోలీసులు అరెస్టు చేశారని చోక్సీ చెప్పాడు.