వైభవ్ సిక్సర్ల సునామీ వెనుక గురువు వాట్సాప్ మంత్రం!
- ఇంగ్లండ్పై 175 పరుగులతో వైభవ్ వీరవిహారం
- ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్
- బౌన్సర్లను ఎదుర్కోవడంలో వైభవ్కు కోచ్ కీలక సలహా
టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడుతున్నా వైభవ్ సెంచరీ మార్కును అందుకోలేకపోవడాన్ని గమనించిన కోచ్ ఫైనల్కు ముందు అతడికి కీలక సూచనలు చేశాడు. ముఖ్యంగా ఆఫ్-స్టంప్ వెలుపల వచ్చే బౌన్సర్లకు ఆడేటప్పుడు తల వంచకుండా, బాడీ బ్యాలెన్స్ ఎలా కాపాడుకోవాలో టెక్నికల్ అడ్వైజ్ ఇచ్చాడు. "నువ్వు ఆడే ప్రతి టోర్నీలో కనీసం ఒక సెంచరీ ఉంటుంది.. ఈ టోర్నీలో అది ఇంకా బాకీ ఉంది" అంటూ కోచ్ చేసిన హెచ్చరిక వైభవ్లో కసిని పెంచింది.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో సెంచరీ బాదిన అతి చిన్న వయస్కుడిగా ఇప్పటికే రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో చరిత్రాత్మక ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించాడు. ఈ టోర్నీలో మొత్తం 439 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఈ బీహార్ సంచలనాన్ని త్వరలోనే సీనియర్ టీమ్ ఇండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.