మంచు కొండల్లో యజమాని మృతి.. నాలుగు రోజులు కాపలా కాసిన పెంపుడు శునకం
- గడ్డకట్టించే చలిలోనూ మృతదేహం పక్కనే ఉన్న పిట్ బుల్
- హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో ఘటన
- రెస్క్యూ సిబ్బందినీ దగ్గరికి రానివ్వని వైనం
ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బందినీ కొంతసేపటి వరకు దగ్గరకు రానివ్వలేదు. యజమాని పట్ల ఆ మూగజీవానికి ఉన్న ప్రేమ, విశ్వాసం చూసి రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కంటతడి పెట్టారు. నాలుగు రోజుల పాటు తిండి తినకుండా, అత్యంత కఠిన వాతావరణంలోనూ ఆ పిట్ బుల్ తన యజమాని మృతదేహాన్ని వదలకుండా కాపలా కాసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఆ శునకాన్ని మచ్చిక చేసుకుని మృతదేహాన్ని తరలించారు.