ఇన్స్టాగ్రామ్కు అంతరాయం... యూజర్ల ఇక్కట్లు!
- కొన్ని గంటల పాటు నిలిచిపోయిన ఇన్స్టాగ్రామ్ సేవలు
- అమెరికాలో ప్రధానంగా కనిపించిన సాంకేతిక సమస్య
- లాగిన్, కంటెంట్ లోడింగ్లో ఇబ్బందులు పడ్డ యూజర్లు
- భారత్పై చాలా స్వల్ప ప్రభావం చూపిన ఔటేజ్
- ఇప్పటివరకు స్పందించని మాతృసంస్థ మెటా
ఔటేజ్లను ట్రాక్ చేసే వెబ్సైట్ 'డౌన్డెటెక్టర్' ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:10 గంటల సమయంలో సమస్య తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సుమారు 180 మందికి పైగా యూజర్లు ఫిర్యాదులు చేశారు. చాలామందికి యాప్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ మెసేజ్ చూపించకుండా, కేవలం తెల్లటి స్క్రీన్ మీద రీఫ్రెష్ ఐకాన్ మాత్రమే కనిపించిందని సోషల్ మీడియాలో స్క్రీన్షాట్లు పంచుకున్నారు.
డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం, ఫిర్యాదు చేసిన వారిలో 45 శాతం మందికి యాప్కు సంబంధించిన సమస్యలు, 41 శాతం మందికి లాగిన్ సమస్యలు ఎదురయ్యాయి. మరో 14 శాతం మంది తమ ఫీడ్ లేదా టైమ్లైన్ సరిగ్గా లోడ్ కావడం లేదని తెలిపారు.
అయితే, ఈ అంతరాయం ప్రభావం భారత్లో చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 10 మంది యూజర్లు మాత్రమే సమస్యలు ఎదుర్కొన్నట్టు ఫిర్యాదు చేశారని డౌన్డెటెక్టర్ పేర్కొంది. దీన్నిబట్టి ఈ సమస్య కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్టు తెలుస్తోంది.
ఈ అంతరాయానికి గల కారణాలపై మాతృసంస్థ మెటా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.