పొగమంచుతో లక్నో టీ20 రద్దు...టికెట్ల డబ్బు రిఫండ్ చేస్తున్న యూపీసీఏ
- పొగమంచు కారణంగా రద్దయిన భారత్-సౌతాఫ్రికా నాలుగో టీ20
- ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని యూపీ క్రికెట్ సంఘం ప్రకటన
- శుక్రవారం నుంచి రిఫండ్ ప్రక్రియ షురూ
- ఆన్లైన్, ఆఫ్లైన్లో కొన్నవారికి వేర్వేరుగా ఏర్పాట్లు
- ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, "టికెట్ల రిఫండ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో టికెట్లు కొన్నవారికి ఆన్లైన్లోనే డబ్బులు వాపస్ వస్తాయి. కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే మినహాయించుకొని మిగతా మొత్తం రిఫండ్ చేస్తాం. ఆఫ్లైన్లో టికెట్లు కొన్నవారి కోసం ఏకానా స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో న ప్రకటన కూడా ఇస్తాం" అని వివరించారు.
గురువారం రాత్రి అంపైర్లు కేఎన్ అనంతపద్మనాభన్, రోహన్ పండిట్ మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం, పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో, మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుప్తా స్పందిస్తూ "మ్యాచ్ జరగనందుకు చాలా చింతిస్తున్నాం. ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి సమయం వృధా అయినందుకు క్షమాపణలు కోరుతున్నాం" అని గుప్తా అన్నారు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.