హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది: సీఎం చంద్రబాబు
- ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటైన కన్హా శాంతి వనాన్ని సందర్శించిన చంద్రబాబు
- అన్ని రంగాలను ఒకేచోట మేళవించడం అద్భుతమన్న ముఖ్యమంత్రి
- యువత, మహిళల కోసం హార్ట్ఫుల్నెస్ చేస్తున్న కృషిపై ప్రత్యేక ప్రశంసలు
- సంస్థ నిర్వాహకులు దాజీ దార్శనికతను కొనియాడిన చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. "హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా యువతకు, మహిళలకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేయడం, ప్రపంచ స్థాయి నాయకులకు అండగా నిలవడం, పిల్లల్లో మేధోశక్తిని పెంపొందించడం వంటివి చేపట్టడం అభినందనీయం" అని పేర్కొన్నారు.
శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షులు, హార్ట్ఫుల్నెస్ గైడ్ అయిన దాజీ దార్శనికతను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సమాజ పరివర్తన కోసం కన్హా శాంతి వనం చేస్తున్న కృషి భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

