విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దంపతులు
- ఆలయంలో ప్రత్యేక పూజలు.. వేదమంత్రాలతో స్వాగతం పలికిన అర్చకులు
- ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థన
- దేశంలో వేగంగా ఎదుగుతున్న నగరాల్లో విజయవాడ ఒకటని ప్రశంస
- రాబోయే రోజుల్లో విజయవాడకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఆశాభావం
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో రాధాకృష్ణన్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.
విజయవాడ నగరంపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో నగరం శరవేగంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విజయవాడ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.