తాజ్ మహల్పై యూపీ కోర్టులో మరో పిటిషన్
- తాజ్ మహల్ను హిందూ దేవాలయం తేజో మహాలయగా ప్రకటించాలని పిటిషన్
- తాజ్ మహల్లో నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరిన పిటిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్
- ఏప్రిల్ 9న ఆగ్రా కోర్టులో విచారణకు రానున్న పిటిషన్
యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ దావా వేశారు. తాజ్ మహల్గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందంటూ పిటిషనర్ తన వాదనలకు బలం చేకూర్చేలా వివిధ చారిత్రక పుస్తకాలను ఈ సందర్భంగా ఉదహరించారు. ఇదిలాఉంటే.. తాజ్ మహల్ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి.