రాష్ట్ర మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
- ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం
- వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా
- మంగళగిరి జయహో సభ సందర్భంగా టీడీపీలో చేరిక
- బర్తరఫ్ కు సిఫారసు చేసిన సీఎం జగన్
- గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాజ్ భవన్
ఈ క్రమంలో, నేడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేస్తున్నానని, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని గుమ్మనూరు జయరాం ప్రకటించారు. టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఇవాళ మంగళగిరి జయహో బీసీ సభ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు.
ఈ నేపథ్యంలో, ఆయనను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన మీదట, గవర్నర్ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.