మథురలో కృష్ణుడి గుడి కోసం రాజస్థాన్ మంత్రి ప్రతిజ్ఞ
- ఒక్కపూటే భోజనం చేస్తానంటూ ప్రతిన బూనిన మదన్ దిలావర్
- రామమందిరం కోసం మెడలో దండ వేసుకోనంటూ గతంలో ప్రతిజ్ఞ
- బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం దీక్ష విరమించిన మంత్రి
ఈ సందర్భంగా రామ్ గంజ్ మండి సిటీలో జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. డమరుకం మోగిస్తూ, తాళాలు వాయిస్తూ మంత్రి తన ఆనందాన్ని చాటుకున్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయోధ్యలో తన కరసేవ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయోధ్య రామ మందిరంతో కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష నెరవేరిందని చెప్పారు. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మందిర నిర్మాణం మిగిలి ఉందని అన్నారు. మథురలో శ్రీకృష్ణుడికి మందిరం నిర్మించే వరకు రోజుకు ఒక్క పూట భోజనం చేస్తానని మదన్ దిలావర్ తాజాగా ప్రతిజ్ఞ చేశారు.