పవన్ కల్యాణ్ కు ఓటేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడంలేదు: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
- వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు
- పవన్ ఎన్ని పర్యటనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదన్న సిద్ధార్థ్ రెడ్డి
- అందుకే పవన్ వివాదాలు రేకెత్తిస్తున్నారని విమర్శలు
- గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీత
ఏపీలో ఎన్ని పర్యటనలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పవన్ వివాదాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శించారు. రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
అసలు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని, ఆయనకు ఓటేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడం లేదని సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఏపీలో టీడీపీ పనైపోయిందని, అలాంటి పార్టీతో పొత్తులకు పవన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.