సీబీఐ విచారణను పరిశీలిస్తే వైసీపీతో బీజేపీకి సంబంధం లేదనే విషయం తెలిసిపోతుంది: సునీల్ దేవధర్
- జగన్ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమన్న సునీల్ దేవధర్
- దర్యాప్తు సంస్థలను కేంద్రం ఎప్పుడూ దుర్వినియోగం చేయదని వ్యాఖ్య
- టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్
ఏపీ ప్రభుత్వం తెలుగు భాషను చంపేస్తోందని సునీల్ దేవధర్ విమర్శించారు. తెలుగు, సంస్కృత పాఠశాలలను మూసివేసి... ఇంగ్లిష్ మీడియం విద్య ద్వారా క్రైస్తవ మతాన్ని పెంచాలనుకుంటున్నారని విమర్శించారు. మతమార్పిడికి ఇదొక మార్గమని చెప్పారు. టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చేలా నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోకపోతే బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. ఏడుకొండల వాడితో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు.