అవినాశ్ రెడ్డికి స్వల్ప ఊరట.. రేపు ఉదయం 10.30 గంటలకు రమ్మన్న సీబీఐ
- హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన అవినాశ్ రెడ్డి
- విచారణను 3.45కి వాయిదా వేసిన హైకోర్టు
- ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీత
మరోవైపు, బెయిల్ పిటిషన్ పై వాదనలను మధ్యాహ్నం 3.45కి హైకోర్టు వాయిదా వేసింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఈ నెల 30లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని... విచారణకు ఎప్పుడు పిలిచినా పిటిషన్లు వేస్తున్నారని సీబీఐ తరపు లాయర్లు వాదించారు. బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తర్వాత సీబీఐ విచారణకు అవినాశ్ హాజరవుతారని ఆయన తరపు లాయర్లు చెప్పారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.