సూర్య భాయ్ తగ్గేదేలే.. మెరుపు సెంచరీ కొట్టిన సూర్యకుమార్
- 49 బంతుల్లోనే శతకం సాధించిన వైనం
- న్యూజిలాండ్ తో రెండో టీ20లో భారత్ భారీ స్కోరు
- నిరాశ పరిచిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 191/6 స్కోరు చేసింది. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్ తో 36) కూడా ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ రిషబ్ పంత్ 13 బంతులు ఆడి ఆరు పరుగులకే ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. 6.4 ఓవర్లలో భారత్ 50/1 స్కోరు ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. తిరిగి మొదలైన తర్వాత సూర్యకుమార్ చెలరేగిపోయాడు. కాగా, చివరి ఓవర్లో పాండ్యా, దీపక్ హుడా, సుందర్ లను ఔట్ చేసిన టిమ్ సౌథీ హ్యాట్రిక్ సాధించాడు.
కాగా, ఈ జులైలో ఇంగ్లండ్ పై సూర్యకుమార్ తొలి శతకం సాధించాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఈ ఫార్మాట్ లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ ఖాతాలో నాలుగు శతకాలు ఉండగా.. కేఎల్ రాహుల్ రెండు సాధించాడు.