సైరస్ మిస్త్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన జగన్
- నిన్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైరస్ మిస్త్రీ
- మిస్త్రీ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించిన జగన్
- గొప్ప వ్యాపార దిగ్గజమని కొనియాడిన సీఎం
సైరస్ మిస్త్రీ వయసు 54 సంవత్సరాలు. నిన్న మరో ముగ్గురితో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘార్ జిల్లా చరోటీ నాకా వద్ద 3.15 గంటల సమయంలో సూర్య నది వంతెనపై రోడ్డు డివైడర్ ను ఢీకొన్న మెర్సిడెస్ బెంజ్ కారు, ఆ తర్వాత రిటెన్షన్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిస్త్రీ మరణంపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.