డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం.. అర్ధరాత్రి సుచరిత ఇంటి వద్ద ఆందోళన
- తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా ‘డొక్కా’ నియామకం
- ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించారంటూ కార్యకర్తల ఆగ్రహం
- అర్ధరాత్రి వేళ సుచిరిత ఇంటి వద్ద కార్యకర్తల బైఠాయింపు
- శ్రీదేవికి నచ్చజెప్పిన సుచరిత
దీంతో స్పందించిన సుచరిత బయటకు వచ్చి ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని, అధిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుందామని చెప్పడంతో శ్రీదేవి ఆందోళన విరమించారు. మరోవైపు, తాడికొండ నేతలు కూడా సుచరిత నిర్ణయంపై మండిపడుతున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 గంటల్లోగా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే నాలుగు మండలాల్లోని నాయకులందరం కలిసి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.