దేవాదాయ శాఖలో అవినీతి వాస్తవమే... ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్య
- దేవాదాయ శాఖ మంత్రి కొట్టు పదవీ బాధ్యతల స్వీకారం
- దేవాదాయ శాఖలో అవినీతిని నిర్మూలిస్తానని హామీ
- ఇకపై ఆలయాల్లో సామాన్యులకే ప్రాధాన్యమన్న మంత్రి
సోమవారం దేవాదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయవాడలో ఆ శాఖ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కూడా మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై దేవాలయాల్లో సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన మంత్రి... వీఐపీలను ఒకేసారి పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదని తెలిపారు.