జగన్తో 2 గంటల భేటీ తర్వాత బాలినేని ఏమన్నారంటే..!
- వైఎస్ కుటుంబానికి మేం సన్నిహితులం
- సీఎం జగన్ కు విధేయులం
- సురేశ్తో నాకు విభేదాలు లేవు
- సీఎం అభీష్టం మేరకు పనిచేస్తానన్న బాలినేని
భేటీ అనంతరం జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన బాలినేని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, 'వైఎస్ కుటుంబానికి మేం సన్నిహితులం. సీఎం జగన్ కు విధేయులం. పదవి లేకపోతే కొంచెం ఫీల్ ఉంటుంది. అంతే తప్పించి రాజీనామా దిశగా నాపై జరుగుతున్న ప్రచారాలు సరికాదు. వాటిని ఖండిస్తున్నా. మంత్రి ఆదిమూలపు సురేశ్తో నాకు విభేదాలు లేవు. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తా. నేనెప్పుడూ మంత్రి పదవి కోసం పాకులాడలేదు. మంత్రి పదవిని ఆ రోజే వదిలేశాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ వైసీపీ' అన్నారు.