సంస్కార హీనులకు అసెంబ్లీ వేదిక కావడం దురదృష్టకరం: కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్
- తెలుగు జాతి చరిత్రలో దుర్దినం
- నిండు శాసనసభలో వైసీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు
- కౌరవులకు ఎలాంటి గతి పట్టిందో గుర్తుందా?
సంస్కారవంతులు, ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన సభ నేడు సంస్కార హీనులకు వేదిక కావడం దురదృష్టకరమని అన్నారు. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన చోట చంద్రబాబు, భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. కౌరవ సభలో సంస్కార హీనంగా ప్రవర్తించిన దుర్యోధన, దుశ్శాసనులకు ఎలాంటి గతి పట్టిందో ఒకసారి గుర్తు చేసుకోవాలని, శిశుపాలుడిలా వైసీపీ నేతల వంద తప్పులు పూర్తయ్యాయని అన్నారు. ఇక వారి అరాచకాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.