రైతులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి సాయం.. ట్రాక్టర్ల పంపిణీ!
- రైతులకు 23 ట్రాక్టర్ల పంపిణీ
- 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగింత
- గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్న అవినాశ్ రెడ్డి
ఈ సందర్భంగా ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ, శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఎమ్మెల్యే కాకముందు నుంచీ ఆయన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. దివంగత వైయస్ మాదిరి తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు.
శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నేత నారా లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. రాబందులా శవాల కోసం లోకేశ్ ఎదురు చూస్తున్నాడని దుయ్యబట్టారు. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ లోకేశ్ వాలిపోతున్నాడని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.